భువనగిరి : మున్సిపాలిటీలలో పారిశుధ్యం, అభివృద్ధి పనులపై ప్రత్యక్షంగా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, ఆదర్శవంతమైన పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి పట్టణ ప్రగతికి తోడ్పడాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సూచించారు. గురువారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్లు, మున్సిపాలిటీ చైర్మన్లు, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. పట్టణ ప్రగతిలో భాగంగా పారిశుద్ధ్యం, పచ్చదనం, వైకుంఠధామాలు, డంప్యార్డులు, పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ, వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల ఏర్పాటు, ఇంటింటా తడి, పొడి చెత్త సేకరణ తదితర కార్యక్రమాలపై దిశా నిర్ధేశం చేశారు.
ఈ కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ దీపక్తివారీ, మున్సిపల్ చైర్మన్లు ఎన్నబోయిన ఆంజనేయులు, శంకరయ్య, సావిత్రీ, ఎరుకల సుధాహేమేందర్గౌడ్, విజయలక్ష్మీ వివిధ మున్సిపాలిటీల కమీషనర్లు తదితరులు పాల్గొన్నారు.