టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా
పండుగలా నిర్వహించారు. టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. అనాథాశ్రమాలు, ప్రభుత్వ దవాఖానల్లో పండ్లు, దుస్తుల పంపిణీతోపాటు అన్నదానాలు చేశారు. పలుచోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించారు. కేటీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి సన్నిధిలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.
యాదాద్రి భువనగిరి, జూలై 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తండ్రికి తగ్గ తనయుడని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అభివర్ణించారు. అప్పటి కేంద్రం ప్రభుత్వం మెడలు వంచి కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధిస్తే, మంత్రి కేటీఆర్ విదేశీ పెట్టుబడులతో రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. ఆదివారం రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం సందర్భంగా ప్రభుత్వ విప్ యాదాద్రిలో ప్రత్యేక పూజలు చేశారు. స్వయంభూ ప్రధానాలయంలో లక్ష పుష్పార్చన, సువర్ణ పుష్పార్చనలో పాల్గొని కేటీఆర్ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యాదాద్రి వైకుంఠ ద్వారం వద్ద టీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్వల్ప గాయానికి గురైన మంత్రి కేటీఆర్ త్వరగా కోలుకోవాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. అభివృద్ధే తారకమంత్రగా రాష్ట్ర పురోగతిలో కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రి కేటీఆర్ నిండు నూరెళ్లు ఆయూరారోగ్యాలతో ఉండి రాష్ర్టాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించే శక్తిని ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. కేటీఆర్ కృషితోనే గూగుల్, మైక్రోసాఫ్ట్ ఆమేజాన్ వంటి గొప్ప కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధాహేమేందర్గౌడ్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పెలిమెల్లి శ్రీధ్ర్గౌడ్, యువజన విభాగం పట్టణాధ్యక్షుడు ముక్యర్ల సతీశ్, రైతుబంధు డైరెక్టర్ మిట్ట వెంకటయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ కాటం రాజు, కౌన్సిలర్ సురేందర్, సర్పంచ్ తోటకూరి బీరయ్య, సెక్రటరీ జనరల్ కసావు శ్రీనివాస్, పాపట్ల నరహరి, సయ్యద్బాబా, రేపాక స్వామి, గుణగంటి బాబురావు, బీర్ల మహేశ్, టి.శ్రీశైలం, కళ్లెం స్వాతి,శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఆలేరు రూరల్ : మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మండలంలోని కొలనుపాకలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆరుట్ల లక్ష్మీప్రసాద్రెడ్డి, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు జంగ స్వామి పాల్గొన్నారు.
రాజాపేట : మంత్రి కేటీర్ జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ గుంటి మధుసూదన్రెడ్డి, రైతబంధు సమితి మండలాధ్యక్షుడు గౌటె లక్ష్మణ్, నాయకులు ఆడెపు శ్రీశైలం, గుర్రం నర్సింహులు, తిరుమలేశ్ పాల్గొన్నారు.
ఆలేరు : స్థానిక ప్రభుత్వ దవాఖానలో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పుట్ట మల్లేశ్గౌడ్ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ జనరల్ సెక్రటరీ కుండె సంపత్, కౌన్సిలర్లు రాయపురం నర్సింహులు, పంతం కృష్ణ, టీఆర్ఎస్ యూత్ పట్టణాధ్యక్షుడు పూల శ్రవణ్, జల్లి నర్సింహులు పాల్గొన్నారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఆలేరు పట్టణంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మొరిగాడి మాధవీవెంకటేశ్ మొక్కలు పంపిణీ చేశారు.
ఆత్మకూరు(ఎం) : మంత్రి కేటీఆర్ జన్మదినం వేడుకలను మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు ఘనంగా జరుపుకొన్నారు. స్వీట్లు పంపిణీ చేసి మొక్కలు నాటారు. టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బూడిద శేఖర్గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గడ్డం దశరథగౌడ్, టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు సోలిపురం అరుణ, యువజన విభాగం మండలాధ్యక్షుడు శంతన్రాజు, మోహన్, నవీన్, సాయి పాల్గొన్నారు.
మోటకొండూర్ : స్థానిక సర్పంచ్ వడ్డెబోయిన శ్రీలత ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, మోటకొండూర్ గ్రామస్తులు పాల్గొన్నారు.
బొమ్మలరామారం : టీఆర్ఎప్ మండలాధ్యక్షుడు పోలగాని వెంకటేశ్ గౌడ్ ఆధ్యర్యంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. స్వీట్లు, పండ్లు పంపీణీ చేశారు. పీఏసీఎస్ చైర్మన్ గూదె బాలనర్సింహ, మేడబోయిన గణేశ్, రాజన్నాయక్, ఉప సర్పంచ్ జూపల్లి భరత్, కుషంగుల సత్యనారాయణ, వడ్లకొండ ఆనంద్, బీరప్ప, మహేశ్గౌడ్, శ్రీకాంత్గౌడ్, మైలారం రామకృష్ణ పాల్గొన్నారు.
భువనగిరి కలెక్టరేట్ : మండలంలోని నమాత్పల్లిలో మాజీ ఎంపీపీ, పూర్ణగిరి సుదర్శన లక్ష్మీనారసింహ స్వామి ఆలయ చైర్మన్ అతికం లక్ష్మీనారాయణగౌడ్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు జరిపారు. టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు బబ్బూరి రమేశ్గౌడ్, ఉప సర్పంచ్ పబ్బతి రాములు, నాయకులు ఎల్లంల బాలమల్లేశ్యాదవ్, కంబాలపల్లి ఆంజనేయులుయాదవ్, కొండపురం సుధాకర్, సుర్పంగ వెంకటేశ్, ఎల్లంల చంద్రపాల్, బీనబోయిన కుమార్, తునికి ముత్యాలు, శ్యామల మమత, మట్ట నవీన్, శ్రీశైలం, మధు, సిద్ధులు, మహేశ్ పాల్గొన్నారు. మండలంలోని రాయగిరిలో సహృదయ అనాథాశ్రమంలో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా మాజీ కౌన్సిలర్ లాయక్ అహ్మద్ వృద్ధులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో అబ్దుల్ జబ్బార్, అహ్మద్ బబ్లూ, వహీం, నాయిమ్, రహమత్, రజాక్, సల్మాన్, అహ్మద్, యూసుఫ్, సిరాజ్, రిజ్వాన్ పాల్గొన్నారు.
భువనగిరి అర్బన్ : మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్గౌడ్ కేక్ కట్ చేశారు. స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం మొక్కలు నాటారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో తాజ్పూర్ గ్రామశాఖ అధ్యక్షుడు ర్యాకల శ్రీనివాస్ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, టీఆర్ఎస్ పట్టణ, మండలాధ్యక్షులు ఏవీ కిరణ్కుమార్, జనగాం పాండు, ప్రధాన కార్యదర్శులు రచ్చ శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ తాజ్పూర్ గ్రామశాఖ అధ్యక్షుడు ర్యాకల శ్రీనివాస్, పట్టణ, మండల నాయకులు పాల్గొన్నారు.
రామన్నపేట : మండల కేంద్రంలోని సుభాష్ సెంటర్లో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మందడి ఉదయ్రెడ్డి, ఎంపీపీ కన్నెబోయిన జ్యోతీబలరాం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి పోచబోయిన మల్లేశం, సర్పంచులు మహేందర్రెడ్డి, రేకాయాదయ్య, ఎంపీటీసీ గొరిగె నర్సింహ, కో ఆప్షన్ సభ్యుడు ఆమేర్, మాజీ వైస్ ఎంపీపీ బద్దుల ఉమారమేశ్, యూత్ మండలాధ్యక్షుడు బత్తుల వెంకటేశం, బీసీసెల్ మండలాధ్యక్షుడు కూనూరు ముత్తయ్య, మైనార్టీసెల్ మండలాధ్యక్షుడు మీర్జా ఇనాయత్బేగ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బొడ్డు అల్లయ్య, బండ ఉపేందర్రెడ్డి, గర్దాసు విక్రం, బండ దామోదర్రెడ్డి, జెల్ల శ్రీనివాస్, రాంసునీత శివకుమార్, బొక్క మాధవరెడ్డి, నోముల శంకర్, ఆముద లక్ష్మణ్ పాల్గొన్నారు.
మోత్కూర్ : టీఆర్ఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకల్లో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ పాల్గొని కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో నార్మాక్స్ డైరెక్టర్ రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డి, టీఆర్ఎస్వీ నాయకుడు శంకర్ పాల్గొన్నారు. మోత్కూర్ మున్సిపల్ చైర్పర్సన్ తీపిరెడ్డి సావిత్రీమోగారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పేదలకు బియ్యం పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బొల్లెపల్లి వెంకటయ్య, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బొడ్లుపల్లి కల్యాణ్చక్రవర్తి, కల్యాణ్, ప్రవీణ్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ నాయకుడు మర్రి అనిల్కుమార్ మండల యాదమ్మకు రూ.5వేల ఆర్థిక సాయం అందజేశారు.
అడ్డగూడూరు : మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం మొక్కలు నాటారు. ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపీణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ దర్శనాల అంజయ్య, జడ్పీటీసీ శ్రీరాముల జ్యోతీఅయోధ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి చౌగోని సత్యంగౌడ్, సర్పంచ్ బాలెంల త్రివేణి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు నాగులపల్లి దేవగిరి, నాయకులు పూలపల్లి జనార్దన్రెడ్డి, మెట్టు భాస్కర్రెడ్డి, చిత్తలూరి నరేశ్, బాలెంల విద్యాసాగర్, బాలెంల అరవింద్, కమ్మంపాటి నరేందర్ పాల్గొన్నారు.