యాదాద్రి భువనగిరి : జిల్లా పర్యటనలో భాగంగా విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. భువనగిరిలో జిల్లా గ్రంథాలయ భవనానికి భూమి పూజ చేశారు. అంతకు ముందు భువనగిరి పట్టణ పరిధిలోని పెద్ద చెరువులో చేప పిల్లలు వదిలారు.
కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, ఎమ్మెల్యే లు పైళ్ల శేఖర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, కలెక్టర్ పమేలా సత్పతి, తదితరులు పాల్గొన్నారు.