యాదగిరిగుట్ట: గత నెలలో ప్రభుత్వం యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు (YTD Trust Board) చైర్మన్, సభ్యులను నియమించింది. శనివారం బోర్డు ప్రమాణ స్వీకారం ఉండగా సభ్యుడు నరసింహమూర్తి (Narasimhamurthy) గైర్హాజరయ్యారు. గతంలో ట్రస్ట్ బోర్డులో అనువంశిక ధర్మకర్తకే చైర్మన్ పదవిని కట్టబెట్టడం ఆనవాయితీ. ఈ ఆనవాయితీకి భిన్నంగా ప్రభుత్వం వేరేవారికి చైర్మన్ పదవి ఇవ్వడంతో ఆయన కినుక వహించినట్టు తెలిసింది. దీంతో ఈ విషయంపై న్యాయపోరాటానికి ఆయన హైకోర్టును ఆశ్రయించినట్టు సమాచారం.