రాజాపేట: మండలంలోని పాముకుంట దోసర వాగులో వరద ఉధృతికి కొట్టుకు పోయిన ఇద్దరు యువతుల్లో ఒక యువ తి మృతదేహం లభ్యం కాగా మరో యువతి కోసం మంగళవారం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. మండలంలోని బొందు గులకు చెందిన యువతి హిమబిందు కోసం రెండో రోజు ఎన్డీఆర్ఎఫ్ బృందం, రెవెన్యూ అధికారులు, పోలీసులు, యువ కులు, గ్రామస్తులు కలిసి ఘటన జరిగిన పాముకుంట దోసర వాగు నుంచి మొదలు కొని నెమిల రోడ్డ్యాం వరకు గాలించినా జాడ తెలియరాలేదు.
భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ కోట్ల నర్సింహారెడ్డి, యాదగిరిగుట్ట సీఐ నర్సయ్య, తహసీల్దార్ జయమ్మ, సంఘ టన స్థలానికి చేరుకొని గల్లంతైన యువతి గాలింపు చర్యలను పర్యవేక్షించారు. యువతి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యల్లో యువకులు పాల్గొనాలని డీసీపీ కోరారు. గల్లంతైన యువతి కోసం గాలింపు కొనసాగుతుందన్నారు. కాగా ఎంపీడీ వో రామరాజు, సర్పంచ్ కంచర్ల శ్రీనివాస్రెడ్డి యువకులు కూడా వరద నీటిలో యువతి జాడకోసం గాలించారు. కార్యక్ర మంలో ఎన్డీఆర్ఎఫ్ సీఐ యోగేశ్కుమార్వర్మ, ఎస్సై శ్రీధర్రెడ్డి, ఎంపీపీ గోపగాని బాలమణీయాదగిరిగౌడ్, గ్రామ సర్పం చ్ కంచర్ల శ్రీనివాస్రెడ్డి, పోలీస్, రెవెన్యూ సిబ్బంది, యువకులు పాల్గొన్నారు.