బీబీనగర్: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో భాగంగా బీబీనగర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న సయ్యద్ రెహాన్ బరువైన డ్రైనేజీ మ్యాన్హోల్ను సులువుగా తీయడానికి ఉపయోగించే పద్దతిని కనుగొని తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఇన్నోవేషన్ సెల్ ప్రకటించిన ఆవిష్కరణలో రెండో స్థానానికి ఎంపికయ్యాడు.
మూతను తీయడానికి ఇబ్బందులు పడుతున్న పారిశుధ్య కార్మికులను చూసి, నిత్యం శ్రమిస్తూ మనకు స్వచ్ఛతను పంచే సఫాయి కార్మికులకు సాయంగా ఏదైనా పరికరం కనిపెట్టాలనే అలోచనతో ఇంటింటా ఇన్నోవేటర్లో భాగంగా ఈ పరికరాన్ని తయారు చేశానని దీని తయారీకి సైన్స్ టీచర్ బి. శ్రీనివాసులు సార్ సూచనలు చేశాడన్నారు. ఈ పరికరం ద్వారా బరువైన డ్రైనేజీ మూతలను సులభంగా తీసి పక్కన పెట్టి, పని ముగించిన తరువాత తిరిగి యథావిధిగా బిగించొచ్చు. ది