రాజాపేట, నవంబర్ 11 : రాజాపేట మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాలను మంగళవారం జిల్లా వ్యవసాయ అధికారి వెంకటరమణారెడ్డి తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. అదేవిధంగా పాముకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. బొందుగుల రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పద్మజ, ఏఈఓలు ప్రణీత, అంజయ్య వినీత, భవిత పాల్గొన్నారు.