రామన్నపేట, ఏప్రిల్ 02 : వంద శాతం కాన్పులు ప్రభుత్వ దవాఖానాల్లోనే అయ్యే విధంగా వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు కృషి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. గురువారం రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను ఆయన తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఫార్మసీ స్టోర్ను పరిశీలించి అన్ని మందులు ఉన్యాయా.. అన్ని మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆనంతరం రిజిస్ట్రేషన్, ఓపీ, ల్యాబ్ను పరిశీలించారు. దవాఖాన భవనంను, డ్రైనేజి వ్యవస్థను పరిశీలించి వెంటనే మరమతులు చేపట్టాలని టీఎస్ ఐఎండీసీ డీఈని ఆదేశించారు. దవాఖాన పరిధిలోని పీహెచ్సీల వైద్యులు. ఏఎన్ఎంలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
గత సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాల్లో జరిగిన కాన్సుల వివరాలను పీహెచ్సీల వారీగా సమీక్షించారు. 50 శాతం కన్న ఎక్కువ కాన్పులు ప్రైవేటు దవాఖానాల్లోనే జరగడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. డీసీహెచ్, డీఎంహెచ్లు ప్రతినెల మొదటి వారంలో కాన్పులపై సమీక్ష సమావేశం నిర్వహించి రిపోర్టు తనకు అందజేయాలని ఆదేశించారు. దవాఖాన ప్రాగణంలో చెట్లను పెట్టి సంరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని సర్పంచ్ గరిక సత్యనారాయణకు సూచించారు. కలెక్టర్ వెంట డీసీ హెచ్ఎస్ చిన్నా నాయక్, బాఎంహెచ్ఓ మనోహార్, తాసీల్దార్ లాల్బహదూర్, ఎంపీడీఓ రాములు, దవాఖాన సూపరింటెండెంట్ శ్వేత ప్రియాంక ఉన్నారు.

వంద శాతం కాన్పులు ప్రభుత్వ దవాఖానలోనే చేయాలి : కలెక్టర్ అనురాగ్ జయంతి