గుండాల: గుండాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం డీఎంహెచ్వో సాంబశివరావు పరిశీలించారు. ఈ నెల 19న జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో పారిశు ధ్యం లోపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించాలని డీఎంహెచ్వో సాంబశివరావును ఆదేశించా రు. ఈ నేపథ్యంలో డీఎంహెచ్వో దవాఖాన పరిసరాలను, పారిశుధ్య పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దవాఖానలో నీటి సౌకర్యం ఏర్పాటు చేసి పారిశుధ్య పనులు సక్రమంగా చేయడంతో పాటు దవాఖానలో పేరుకుపోయిన వ్యర్ధాలను తొలగించాలని, దవాఖానకు పేయింటింగ్ వేయించాలని అన్నారు. అందుకు గాను కావల్సిన నిధుల వినియోగానికి దవ ఖాన అభివృద్ధి కమిటీతో చర్చించారు. దవాఖానలో పారిశుధ్య పనులు, కొత్తగా కావాల్సిన వస్తువుల కొనుగోలుకు నిధులు సరిపోకపోతే ప్రత్యేకంగా నిధులను మంజూరు కోసం కలెక్టర్ను కోరనున్నట్లు ఆయన తెలిపారు.
ఆరోగ్య కేంద్రంలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు, ఉత్తర్వులు రాగానే ఖాళీల భర్తీని చేయనున్నట్లు ఆయన తెలి పారు. ఆయన వెంట జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు ఎండీ.ఖలీల్, మోత్కూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ మూగల శ్రీనివాస్, వైద్యాధికారి డా.శ్రీని వాస్, నాయకులు కోలుకొండ రాములు, మత్స్యగిరి, ఆరోగ్య మిత్ర శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
అడ్డగూడూరు: దవాఖాన పరిశీలన
అడ్డగూడూరు: మండలంలోని ప్రభుత్వ దవఖానాను సోమవారం జిల్లా వైధ్యాధికారి సాంబశివరావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దవాఖానలో జరుగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దవాఖాన ను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, వెంటనే రంగులు వేయించాలని, టాయిటెట్లను, కీటికీలను రిపేరు చేయించా లన్నారు.
విద్యుత్ మరమ్మతులు చేయించాలన్నారు. దవాఖానను 24 గంటల దవాఖాను మార్చేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. త్వరలో సిబ్బంది నియామకం చేపడుతామన్నారు.ఆయన వెంట మండల వైధ్యాధికారి నరేశ్, తదితరులు ఉన్నారు.