చౌటుప్పల్ రూరల్: ఈనెల 2న సీఎం కేసీఆర్ ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తున్న నేపథ్యంలో గల్లీ గల్లీలో గులాబీ జెండాను ఎగురవేయాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలపరిధిలోని దామెర గ్రామంలోని బాలాజీ గార్డెన్లో చౌటుప్పల్, సంస్థాన్నారాయణపురం మండలాల పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
నూతన కార్యవర్గాల ఏర్పాటుపై పార్టీ శ్రేణులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 2 నుంచి 12వరకు గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ రెండు మండలాల్లోని 57 గ్రామపంచాయతీలతోపాటు మున్సిపాలిటీ కమిటీల నిర్మాణం జరుగుందన్నారు. ఈ కమిటీలు పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. పార్టీకోసం క్రియాశీలకంగా పనిచేసేవారికి కమిటీలో ప్రాధాన్యం ఉంటుందన్నారు.
అన్ని వర్గాలకు కూడా ప్రతినిధ్యం ఉంటుందన్నారు. పార్టీలకతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ తాడూరి వెంకట్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ వెన్రెడ్డి రాజు, సంస్థాన్నారాయణపురం ఎంపీపీ గుత్తా ఉమా, జడ్పీటీసీ బానుమతి, మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు చింతల దామోదర్రెడ్డి, జక్కిడి జంగారెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు గిర్కటి నిరంజన్గౌడ్, కత్తుల లక్ష్మయ్య, ఊడుగు శ్రీనివాస్గౌడ్, మునగాల ప్రభాకర్రెడ్డి, కొత్త పర్వతాలు, ముప్పిడి శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు.