యాదాద్రి భువనగిరి : భువనగిరి పట్టణం మాసుకుంటలో రూ.48 లక్షలతో నిర్మించబోయే సఖి కేంద్ర భవన నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.
సఖి కేంద్రం ద్వారా మహిళల సంక్షేమం, బాధిత మహిళలకు సేవలు అందించే అవకాశం ఉంది. బాలికలు, స్త్రీల సంక్షేమ కోసం ఐదు అంశాలలో వైద్య సేవలు, కౌన్సిలింగ్ సేవలు, పోలీసు సహాయం, న్యాయ సహాయం, తాత్కాలిక వసతి సేవలు అందిస్తారు.
2019 నవంబర్ నుంచి మొదలైన సఖి కేంద్రం ద్వారా ఇప్పటివరకు 705 కేసులు నమోదు కాగా, వీరిలో 342 మందికి వసతి కల్పించడం, మిగతా వారికి కౌన్సిలింగ్ సేవలు అందించారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, భువనగరి మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, ఎంపీపీ నిర్మల, ఏసీపీ వెంకటరెడ్డి, భువనగిరి మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, డాక్టర్ ప్రమీల, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కృష్ణవేణి పాల్గొన్నారు.