తుర్కపల్లి: పాడి పరిశ్రమ అభివృద్ధి పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి అన్నారు. మండలంలోని మోతీరాంతండాలో శుక్రవారం ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పశువైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతులు వ్యవసాయంతో పాటు పశుపోషణ వైపు మొగ్గు చూపడం ద్వారా ఆర్థికంగా ఎదగవచ్చన్నారు. పై
ప్రభుత్వం పశు సంవర్ధకశాఖ అధ్వర్యంలో అనేక సబ్సిడీలతో పాటు ఉచితంగా మందులను అందజేస్తున్నదన్నారు. ప్రభుత్వం ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ.. వ్యవసాయాన్ని పండుగగా మార్చారన్నారు. సబ్సిడీపై నాటుకోళ్ల పెంపకం గొర్రెలు, మేకల యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పి స్తుందన్నారు.
యూనిట్ల నిర్వహణకు ప్రభుత్వం ఉచితంగా శిక్షణ సైతం అందిస్తున్నదన్నారు. పంట దిగుబడికి అనుగుణంగా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ఇప్పటికే కొన్న ధాన్యం మొత్తం గోదాముల్లో నిలువుందన్నారు. రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలన్నారు.
రుస్తాపురం గ్రామ పరిధిలోని రాయిని చెరువు నిండి అలుగు పోస్తుండడంతో బ్యాక్వాటర్తో మోతీరాంతండా రైతులు తమ వ్యవసాయ బావుల వద్దకు వెళ్లలేక పోతున్నామని బావుల వద్దకు వెళ్లే రోడ్డు పూర్తిగా నీట మునిగిందని బ్రిడ్జి నిర్మాణం చేపట్టి తమ సమస్యను పరిష్కరించాలని గ్రామంలోని పలువురు రైతులు ప్రభుత్వ విప్కు వినతి పత్రం అందజేశారు. వెంటనే స్పందించిన ఆమె బ్రిడ్జి నిర్మాణానికి సంబంధిత అధికారులతో సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
అదే విధంగా గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 20మంది విద్యార్థులకు గాను ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడని ఉన్న ఉపాధ్యాయుడు అత్యవసర పరిస్థితుల్లో సెలవు పెడితే బడి మూత పడుతున్నదని స్థానిక సర్పంచ్ బిచ్చునాయక్ ప్రభుత్వ విప్ దృష్టికి తీసుకురాగా మరో ఉపాధ్యాయుడిని నియమించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, వైస్ చైర్మన్ గ్యాదపాక నాగరాజు, ఎంపీపీ బూక్యా సుశీల, జిల్లా పశువైద్యాధికారి కృష్ణ, తుర్కపల్లి, బొమ్మలరామారం పీఏసీఎస్ చైర్మన్లు సింగిరెడ్డి నరసింహరెడ్డి, గూదె బాలనర్సింహా, వైస్ ఎంపీపీ మహదేవుని శ్రీనివాస్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ కొమిరిశట్టి నర్సింహులు, సర్పంచ్ బిచ్చునాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బద్దునాయక్, పత్తిపాటి మంజుల, నాయకులు సుంకరి శట్టయ్య, రవీంద్రనాథ్గౌడ్, ప్రభాకర్రెడ్డి, తలారి శ్రీనివాస్, రాజయ్య, భాస్కర్నాయక్ తదితరులు పాల్గొన్నారు.