యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చెంత గోదావరి జల సవ్వడులు హోరెత్తనున్నాయి. స్వామివారి తెప్పోత్సవాలు నిర్వహించే గండి చెరువును గోదావరి జలాలతో నింపాలనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా సర్వం సిద్ధమైంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ 15వ ప్యాకేజీ కెనాల్లో నుంచి యాదగిరిగుట్ట మండలం జంగంపల్లి వద్ద ఉన్న ఓటీ -2 కాలువ ద్వారా యాదాద్రి గండి చెరువుకు గోదావరి జలాలకు సోమవారం ప్రభుత్వ విప్ గొంగిడి సునీతమహేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు.