బీబీ నగర్ మండలం గూడురు గ్రామంలోని శ్రీ ఉమామహేశ్వర ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన నవగ్రహా ప్రతిష్టపాన, మహా కుంభాభిషేక మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ మహోత్సవానికి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, భువనగిరి శాసనసభ్యుడు పైళ్ళ శేఖర్ రెడ్డి. జెడ్పీ ఛైర్మన్ సందీప్ రెడ్డి పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ప్రతినిధులు వారిని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. ఆ భగవంతుడి ఆశీస్సులు గూడురు గ్రామ ప్రజలపై నిత్యం ఉండాలని, గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామి వార్లను కోరుకున్నట్లు తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న నవగ్రహా ప్రతిష్ట మహోత్సవానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.