బీబీనగర్, అక్టోబర్ 28 : గ్రామాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద సమస్యలను పరిష్కరించడానికి విద్యుత్ అధికారులు పల్లె బాట పట్టారు. ఇందులో భాగంగా బీబీనగర్ మండల పరిధిలోని రంగపురంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ) ఆర్.సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం విద్యుత్ అధికారులు పల్లె బాట కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద పెరిగిన చెట్లను తొలగించారు. దీంతో పాటు విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా మరమ్మతులు చేపట్టారు. అనంతరం విద్యుత్ వినియోగదారుల సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరిస్తామన్నారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు కలగకుండా ఉండేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీ మచ్చేందర్, ఏఈ మనోహర్ రెడ్డి, లైన్ మెన్లు శ్రీనివాస్, ఆర్.బాల్నరసింహ, సిబ్బంది పాల్గొన్నారు.