తుర్కపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ మొట్టమొదటిసారిగా దళితబంధు పథకం కింద రాష్ట్రంలో వాసాలమర్రి లోనే నిధులను విడుదల చేశారని ఈ నిధులను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్ అన్నారు. మండలంలోని వాసాలమర్రి దళితవాడలో శనివారం ఆయన పర్యటించి పథకం పై దళితులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ చెప్పినట్లు ప్రతి పైసా మీకు నచ్చిన రంగాలలో, వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేసుకునే అవకాశం ఉందన్నారు. దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో సీఎం వాసాలమర్రిలో పథకాన్ని ప్రారంభించి నిధులను విడుదల చేశారని వాటిని సద్వినియోగం చేసుకోని ఆర్థికంగా ఎదగాలన్నారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఫీల్డ్ఆఫీసర్ మంగరాజు శ్రవణ్కుమార్, సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ప్యాకల్టీ శ్రీనివాస్ పాల్గొన్నారు.