యాదాద్రి భువనగిరి : జిల్లాలోని గుండాల మండలంతుర్కల షాపురం ప్రాథమికోన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందన్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలకు పంపి అప్పుల పాలు కావొద్దన్నారు. సర్కార్ బడుల్లోనే సుశిక్షుతులైన అధ్యాపకులు ఉంటారన్నారు.పాఠశాల తరగతి గదులకు కిటికీలు, తలుపులు బిగించాలని సర్పంచ్ భిక్షమయ్యను ఆదేశించారు.
అనంతరం పాఠశాలలో మానసిక వికలాంగుల పిల్లల కోసం ఏర్పాటు చేసిన భవిత విద్య కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.