చౌటుప్పల్:వస్త్రాలపై కేంద్రప్రభుత్వం విధిస్తున్న12శాతం జీఎస్టీని తగ్గించాలని డిమాండ్ చేస్తూ మున్సిపాలిటీ కేంద్రంలో చౌటుప్పల్ క్లాత్ అండ్ రెడిమేడ్ అసోసియేషన్ సభ్యులు బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో ఎస్ సూరజ్కుమార్కు వినతి పత్రం సమర్పించారు. అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ జీఎస్టీ పెంచడం వల్ల వస్త్రవ్యాపారులు తీవ్రంగా నష్టపోతారని, ప్రజలపై పెనుభారం పడతుందన్నారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు జిల్లా భిక్షం, ప్రధాన కార్యదర్శి దేవులపల్లి గణేశం, గౌరవాధ్యక్షుడు చిలువేరు విజయ్శంకర్, తడక నర్సింహ, కర్నాటి శ్యామ్ప్రసాద్, పున్న సత్యనారాయణ పాల్గొన్నారు.