వలిగొండ : ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు ఒక వరం అని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎమ్మె లింగస్వామి అన్నారు. గురువారం వలిగొండ పట్టణ కేంద్రంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి వైద్య చికిత్స కోసం మంజూరైన భీమాగాని ఆనంద్కు రూ. 34 వేలు, బండారు నర్సింహకు రూ. 11 వేల విలువ గల చెక్కులను లబ్ధిదారులకు టీఆర్ఎస్ నాయకులు అందజేశారు. కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు అయిటిపాముల రవీంద్ర, మామిండ్ల రత్నయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎడవెళ్లి శాంతికుమార్, పల్సం రాజు, దొంతరబోయిన నరేష్, ఎక్కలదేవి శ్రీనివాస్, రేగు కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.