రామన్నపేట, మార్చి 17 : ప్రజల జీవనోపాధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దెబ్బతిస్తున్నాయని సిపిఐ రామన్నపేట మండల కార్యదర్శి ఉట్కూరు నరసింహ అన్నారు. రామన్నపేటలోని సుభాష్ సెంటర్ వద్ద సిపిఐ కేంద్ర, రాష్ట్ర పార్టీల పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రపంచ వ్యాప్తంగా అమెరికా సామ్రాజ్యవాద మొండి నిర్ణయాలకు వ్యతిరేకంగా ముందస్తు నిర్ణయాలు తీసుకోకుండా దేశ ప్రజలను అయోమయంలోకి నెట్టి గ్యాస్ ఇతర నిత్యావసర ధరలు పెంచడాన్ని నిరసిస్తూ మంగళవారం సుభాష్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. యుద్ధ వాతావరణం ఏర్పడినప్పుడు ఎగుమతులు, దిగుమతుల విషయంలో దేశానికి అవసరమైన పెట్రోల్, డీజిల్, గ్యాస్ దిగుమతులను ముందస్తుగానే గుర్తించి తగిన నిల్వలను ఏర్పాటు చేయకుండా దేశ వ్యాప్తంగా ప్రజల జీవనోపాధులు దెబ్బ తినే విధంగా చేశారన్నారు. గ్యాస్ కొరతను ముందస్తుగా గుర్తించకుండా కాలయాపన చేసి నిర్లక్ష్యంతో ప్రజలకు నానా ఇబ్బందులు సృష్టించారని దుయ్యబట్టారు.
అమెరికా ఇరాన్ పై చేస్తున్న దాడిని ఖండించి శాంతి వాతావరణం నెలకొనేలా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకుడు ఎర్ర రమేష్ గౌడ్, సిపిఐ మండల సహాయ కార్యదర్శి కళ్లెం రామచంద్రం, పట్టణ కార్యదర్శి రచ్చ యాదగిరి, శివరాత్రి సమ్మయ్య, బాలగోని మల్లయ్య, ఊట్కూరి భగవంత, గంగాపురం వెంకటయ్య, వీరమల్ల ముత్తయ్య, గంగాపురం యాదయ్య, పల్లె మల్లేశం, పర్స సుదర్శన్, ఊట్కూరు కృష్ణ, ఊట్కూరు శీను, పెండెం రవీందర్, ఏనూతుల రమేశ్, కడమంచి జగన్నాథం, వీసం గాలయ్య, ఊట్కూరు శంకర్, జెల్లా అంబయ్య, శ్రావణ్, ఊట్కూరు శంకర్ పాల్గొన్నారు.