సంస్థాన్ నారాయణపురం : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలైన ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మీ పథకం, వృద్ధాప్య పింఛన్ పథకాలు భేష్గా ఉన్నాయని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన కల్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మండల వ్యాప్తంగా 67మంది లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను ఎంపీపీ గుత్తా ఉమా ప్రేమ్చందర్రెడ్డి, జడ్పీటీసీ వీరమళ్ల భానుమతీగౌడ్ కలిసి సోమవారం ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంతో పేద ప్రజలు ఆడబిడ్డల పెండ్లి చేయాలంటే అప్పులు చేసే పనిస్థితి ఉండేదని నేడు కల్యాణ లక్ష్మీ పథకంతో పేద ప్రజలు అడబిడ్డల పెండ్లిని చాలా సంతోషంగా చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ బచ్చనగొని గాలయ్య, సర్పంచ్లు శ్రీహరి, దోనూరి జైపాల్రెడ్డి, సుర్వి యాదయ్యగౌడ్, కట్టెల భిక్షపతి, తాసీల్దార్ బ్రహ్మయ్య, ఎంపీడీవో బండారు యాదగిరి పాల్గొన్నారు.