భువనగిరి కలెక్టరేట్: అక్రమ సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది.. మద్యం మత్తులో తానేం చేస్తున్నాడో తెలియక కడ దాకా తోడుంటా నని బాస చేసిన భర్త మూడు ముళ్ల బంధాన్ని కాల రాసి ప్రియురాలి మోజులో పడి ఏడడుగులు తనతో నడిచిన భార్యను కసాయిగా మారి గొం తు నులిమి పాశవికంగా హత్య చేసిన ఘటన పట్టణంలోని అర్బన్ కాలనీలో ఆదివారం అర్థరాత్రి జరిగింది.
పట్టణ సీఐ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని అర్బన్ కాలనీలో నివాసముంటున్న వెంకటాచారి కొంతకాలం గా వేరోక మహిళ తో అక్రమ సంబంధం నెరపుతున్నాడు. ఈ క్రమంలో మృతురాలు కొండమడుగు లక్ష్మి(33) భర్త వెంక టాచారిని పలుమార్లు నిలదీసింది. కాగా ఇదే విషయమై ఆదివారం రాత్రి సైతం భార్యాభర్తల మధ్య వివాదం చెలరేగింది.
దీంతో వెంకటాచారి విచక్షణ కోల్పోయి భార్య లక్ష్మిని గొంతు నులిమి చంపేశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశా రు. ఘటనా స్థలానికి చేరుకున్న పట్టణ సీఐ సుధాకర్ వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా దవాఖానకు తరలించారు. మృతురాలికి కుమారుడు ఉన్నాడని, మృతురాలి అన్న భాస్కర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.