ఆత్మకూరు(ఎం): దేశంలో ఎక్కడాలేని విధంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి పథకం పేదింటి ఆడ బిడ్డలకు వరం లాంటిదని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 8 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణ లక్ష్మి చెక్కులను మరో ఆరుగురికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మండల కేం ద్రంలోని పార్టీ కార్యాలయంలో అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటు పడుతున్న ప్రభు త్వానికి ప్రజలందరూ అండగా నిలిచి మద్దతు తెలుపాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు భాషబోయిన ఉప్పలయ్య, ఎంపీ టీసీ యాస కవిత, నాయకులు మల్లేశం, సత్తయ్య, దశరథ, పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.