రాజాపేట: దళితుల సంక్షేమం కోసం దళితబంధు పథకాన్ని అమలు చేసిన సీఎం కేసీఆర్ అభినవ అంబేద్కర్ అని సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కంచర్ల శ్రీనివాస్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని బొందుగులలో దళిత బంధు పథకాన్ని స్వాగతిస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చారిత్రాత్మకమైన దళితబంధు పథకాన్ని ఆలేరు నియోజకవర్గంలోని వాసాలమర్రిలో ప్రారంభించడం అభినందనీయ మన్నారు. కార్యక్రమంలో నాయకులు గోపగాని యాదగిరి, మోత్కుపల్లి ప్రవీణ్, కొమ్ము పాండు, కొండూరి స్వామి తదితరులు పాల్గొన్నారు.