యాద్రాది, భువనగిరి : పుణ్యక్షేత్రాల్లో ఒకటైన యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకునేందుకు భక్తుల తాకిడి రోజురోజుకూ పెరుగుతుంది. అంతేస్థాయిలోనూ స్వామివారి హుండీ ఆదాయం(Hundi Income) కూడా పెరుగుతుంది. గత 35 రోజులుగా భక్తులు స్వామివారికి సమర్పించిన కానుకలను లెక్కించగా హుండీ ఆదాయం రూ. 2. 85 కోట్లు వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి ( Temple EO) వెల్లడించారు. వీటితో పాటు మిశ్రమ బంగారము నాలుగు వందల ఇరవై ఐదు గ్రాములు, మిశ్రమవెండి ఐదు కిలోల తొమ్మిది వందల అరవై గ్రాములు వచ్చినట్లు తెలిపారు.
అదేవిధంగా అమెరికాకు చెందిన 2,697 డాలర్లు (American Dollars) , ఆస్ట్రేలియా -85 డాలర్స్, ఇంగ్లాండ్ – 30 పౌండ్స్, యూఏఈ -20 దిరమ్స్, యూరోప్ -120 యురో, మలేసియా – 24 రింగిట్స్, నేపాల్ – 10 రుపిస్ భక్తులు స్వామివారికి సమర్పించారని తెలిపారు. కెనడా – 35 డాలర్స్, భూటాన్- 5, ఉబ్జేకిస్తాన్ 1000 సొమ్ , జార్జియా- 5
ఒమన్ 1/4 రియల్, ఖతర్ -2 రియల్, సౌదీ అరేబియన్- 27 రియల్, ఒమన్ – 100 బైసా వచ్చినట్లు వివరించారు.