రెండేండ్లలో రూ.98 లక్షలతో అభివృద్ధి పరుగులు
ఆకట్టుకుంటున్న పల్లెప్రకృతి వనం
పూర్తైన రైతు వేదిక నిర్మాణం
దాతల సహకారంతో స్వర్గపురి రథం ఏర్పాటు
ఆత్మకూరు(ఎం), ఏప్రిల్6: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో ఆత్మకూరు(ఎం)గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. రైతువేదిక, వైకుంఠధామం, కంపోస్ట్ షెడ్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. సీసీరోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను చేపట్టి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉం చేందుకు సర్పంచ్ కృషి చేస్తున్నారు.
రూ.98 లక్షలతో అభివృద్ధి పనులు
గ్రామంలో 5,176 మంది జనాభా ఉండగా, 3,600 మంది ఓటర్లు, 2,100 ఇండ్లు ఉన్నాయి. 14 వార్డు లు ఉన్న ఆత్మకూరు(ఎం)లో రెండేండ్లలో రూ.98 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టారు. రూ.30లక్షలతో సీసీ రోడ్లు, రూ.30లక్షలతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు, రూ.22లక్షలతో రైతువేదిక, రూ.12లక్షల 60వేలతో వైకుంఠధామం, రూ.2లక్షల 60వేలతో కంపోస్ట్ షెడ్ పనులు, 30 గుంటల భూమిలో రూ.లక్షతో పల్లెప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసిన 2వేల మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు.
పచ్చదనంతో పరిశుభ్రంగా..
హరితహారంతోపాటు పల్లెప్రగతిలో భాగంగా గ్రామంలో పచ్చదనం కోసం ప్రధాన వీధుల వెంట ఇరువైపులా 15 వేల మొక్కలను నాటి వాటి సంరక్షణకు ట్రీగార్డులను ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ పంచాయతీ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన వాటర్ ట్యాంకర్తో నీటిని పోస్తున్నారు. ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేశారు. ప్రధాన వీధుల వెంట పెరిగిన మొక్కలు ఏపుగా పెరిగి నేడు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. పరిశుభ్రతలో భాగంగా ప్రతి ఇం టికీ ఉచితంగా చెత్త బుట్టలను పంపిణీ చేయడంతో తడి, పొడి చెత్తను వేరు చేస్తున్నారు. నిత్యం పంచాయతీ సిబ్బం ది ట్రాక్టర్ ద్వారా ప్రతి ఇంటికెళ్లి చెత్తను సేకరించి కంపోస్ట్ షెడ్లో వేస్తున్నారు. పంచాయతీ సిబ్బంది రోడ్లను ఊడ్చడంతో నేడు గ్రామంలో ఎటు చూసినా పరిశుభ్రమైన రోడ్లు దర్శనమిస్తున్నాయి.
సీసీరోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు
గ్రామంలో అవసరమైన చోట్ల రూ.30 లక్షలతో సీసీరోడ్లు, మరో రూ.30లక్షలతో మురుగు కాలువలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టారు. దీంతో గ్రామంలోని ప్రధాన వీధులు శుభ్రంగా మారడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామ సమస్యలు తీరాయి
పల్లెప్రగతితో గ్రామంలో నిర్మించిన రైతువేదిక, వైకుంఠధామం, కంపోస్ట్ షెడ్ పనులు పూర్తి కావడంతో అన్ని వర్గాల ప్రజల సమస్యలు తీరాయి. ఆత్మకూరు(ఎం)లో ఎక్కువ జనాభా ఉండడంతో వైకుంఠధామం నిర్మాణంతో ఎంతోమందికి మేలు జర గనుంది. -ఆవుల రాములు ఎంపీడీవో ఆత్మకూరు(ఎం)
పచ్చదనం పెంపొందించేందుకు ప్రత్యేక శ్రద్ధ
గ్రామంలో పచ్చదనాన్ని పెంపొందించేం దుకు ప్రతిరోజూ ప్రత్యేక శ్రద్ధ చూపుతు న్నాం. పల్లెప్రగతిలో భాగంగా నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించేందుకు ట్రీగార్డులను ఏర్పాటు చేసి వాటర్ ట్యాంకర్తో మొక్కలకు నీళ్లు అందిస్తున్నాం.
ఇవి కూడా చదవండి
కేంద్రం కుట్రలను తిప్పికొట్టాలి