నీలగిరి, ఫిబ్రవరి 3 : జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సేవిస్తూ మహిళలపై ఆగడాలకు పాల్పడుతున్న ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి కోరారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో శనివారం ఎస్పీ చందనా దీప్తిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో గంజాయి, డ్రగ్స్కు యువత బానిస అవుతున్నారన్నారు. మత్తు పదార్థాల వ్యసనాలకు లోనై పారులు, రైల్వే స్టేషన్, పానగల్ చెరువు, బైపాస్ రోడ్డు, పట్టణ సరిహద్దు ప్రాంతాల్లో యువతులు, మహిళలను బెదిరిస్తూ దాడులు చేస్తూ దోపిడీలకు పాల్పడుతున్నారని తెలిపారు.
సెల్ఫోన్లు లాక్కొని లైంగికంగా వేధిస్తున్నారని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. స్పెషల్ డ్రైవ్ చేపట్టి గంజాయి వంటి మత్తు పదార్థాల మూలాలను చేధించి మహిళలకు రక్షణ కల్పించాలని ఎస్పీకి విన్నవించారు. ఎస్పీని కలిసిన వారిలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలెబోయిన వరలక్ష్మి, పట్టణ కార్యదర్శి భూతం అరుణ, నాయకులు మేకల వరుణ, బొల్లెపల్లి మంజుల పాల్గొన్నారు.