పెన్పహాడ్, మే 15 : నీటి సంపులో పడి ఓ మహిళ మృతి చెందాడు. ఈ ఘటన పెన్పహాడ్ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పేంతల నాగరాణి (46) గత సంవత్సరం నుండి అనారోగ్యంతో బాధపడుతూ మందులు వాడుతున్నది. శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో తన ఇంట్లో ఉన్న సంపులో నీళ్లను తొడుతుండగా ప్రమాదవశాత్తు సంపులో పడి మునిగి మృతి చెందింది. చనిపోయిన కొద్దీ సమయనికి ఇంట్లో ఉన్న తండ్రి బొజ్జ కేశవరెడ్డి, నాగరాణి తమ్ముడు సైదిరెడ్డి గమనించగా అప్పటికే నీటి సంపులో శవమై లభించింది. ఈ సంఘటనపై మృతురాలి కుమారుడు పెంతల సందీప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కస్తాల గోపి కృష్ణ తెలిపారు.