చిట్యాల, అక్టోబర్ 13 : ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని రాజ్యసభ సభ్యుడు, నకిరేకల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.చిట్యాలలో శుక్రవారం బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్య అధ్యక్షతన జరిగిన పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మూడో సారి గెలిపించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. రోజుకు కనీసం నాలుగైదు గంటలు కష్టపడాలని కోరారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో అభివృద్ధ్ది కోసం పనిచేసే చిరుమర్తిని గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధ్ది చేస్తాడని అన్నారు. నిత్యం తన్నులాడుకునే కాంగ్రెస్ పరిస్థితి టిక్కెట్లు కూడ ప్రకటించలేని దుస్థితిలో ఉందని విమర్శించారు. వీరేశంపై ఎన్నో ఆరోపణలు చేసిన కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఇప్పుడు వీరేశం గురించి గొప్పలు చెబుతూ ఆయనను గెలిపించాలని కోరడం సిగ్గుచేటని అన్నారు.
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ కార్యకర్తలు సమష్టిగా కలిసి ప్రభుత్వ పథకాలకు విస్తృత ప్రచారం కల్పించడం ద్వారా తన గెలుపు కోసం సహకరించాలని కోరారు. తాను నియోజకవర్గ అభివృద్ధి కోసం రోజుకు 16 నుంచి 18 గంటలు కష్టపడుతున్నాన ని వివరించారు. గ్రామాల్లో బీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధ్దిని వివరించడంతోపాటు కాంగ్రెస్ వల్ల జరిగిన, జరుగబోయే నష్టాలను ఆ పార్టీ అభ్యర్థ్ధిగా ప్రచారం జరుగుతున్న వ్యక్తి ఆరాచకాలను వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్లు చేయాలని దిశ నిర్దేశం చేశారు. అవతలి వ్యక్తికి బయపడాల్సిన అవసరం లేదని తాను ఎల్లప్పుడు కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్రెడ్డి మాట్లాడుతూ అందరికి అందుబాటులో ఉంటూ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న చిరుమర్తి లింగయ్య గెలుపుకోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేద్దామని అన్నారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, కౌన్సిలర్లు కోనేటి కృష్ణ, బెల్లి సత్తయ్య, పందిరి గీత, కో ఆప్షన్ సభ్యుడు పాటి మాధవరెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ మెండె సైదులు, నాయకులు వనమా వెంకటేశ్వర్లు, గుండెబోయిన సైదులు, సిలువేరు శేఖర్, జిట్ట బొందయ్య, విఠల్రెడ్డి, దాసరి నర్సింహ, పోలేపల్లి సత్యనారాయణ, కొల్లోజు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
– ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్
చిట్యాల : బీఆర్ఎస్కు బలమైన కేంద్రమైన నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జిగా తనను నియమించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాద వ్ కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం చిట్యాల లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నకిరేకల్ నియోజకవర్గం ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి, జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి వంటి ఎందరో బలమైన నేతల నిలయమని అన్నారు. ప్రస్తుత ఎన్నికలు అభివృద్ధ్ది ఆకాక్షించే బీఆర్ఎస్, అభివృద్ధ్ది నిరోధక కాంగ్రెస్ మధ్య జరిగే పోటీ అని ప్రజలు దానిని దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే చిరుమర్తిని గెలిపించాలని కోరారు. రాష్ర్టానికి కాంగ్రెస్ గతంలో చేసిన నష్టం చాలునని మళ్లీ నష్ట పోవడానికి ప్రజలు సిద్ధ్దంగా లేరని అన్నారు.