నల్లగొండ రూరల్, జనవరి 17 : దేశమంతా తెలంగాణ అభివృద్ధి, సంక్షేమాన్ని కోరుకుంటున్నదని, అందుకే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండలోని వీటీ కాలనీలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 303 మంది లబ్ధిదారులకు 1,35,65,700 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, మాడ్గులపల్లి మండలానికి చెందిన 15 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేసి మాట్లాడారు. రాష్ట్రంలో 5 వేల మందికి 28కోట్ల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించిన నియోజకవర్గంగా నల్లగొండ నిలిచిందన్నారు. నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని, ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో 1,100 కోట్ల రూపాయలతో నల్లగొండను నందనవనంగా తీర్చిదిద్దుతున్నామన్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్వలీ, కటికం సత్తయ్యగౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, కనగల్, తిప్పర్తి ఎంపీపీలు కరీం పాషా, నాగులవంచ విజయలక్ష్మి, పాశం సంపత్రెడ్డి, వంగాల సహదేవరెడ్డి, నల్లగొండ, తిప్పర్తి మండలాల పార్టీ అధ్యక్షులు దేప వెంకట్రెడ్డి, రవీందర్రెడ్డి, బకరం వెంకన్న, గాదె రాంరెడ్డి, బోనగిరి దేవేందర్, జనార్దన్, కృష్ణయ్య, బడుపుల శంకర్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.