యాదగిరిగుట్ట, జనవరి13 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి కొండకింద గండి చెరువులోకి మల్లన్నసాగర్ నుంచి కాళేశ్వరం జలాలు వచ్చి చేరుతున్నాయి. కొండకండ్ల గ్రామంలోని 15వ ప్యాకేజీ క్రాస్ రెగ్యులేటర్ వద్ద శుక్రవారం నీటిని విడుదల చేయగా రాత్రి 10 గంటలకు గండి చెరువులోకి వచ్చాయి.
స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల గడువు సమీపిస్తున్న నేపథ్యంలో గండి చెరువులో సమృద్ధిగా నీటిని నిల్వ చేయాలన్న సంకల్పంతో జగదేవపూర్ డివిజన్-1 ఇరిగేషన్ అధికారులు 400 క్యూ సెక్కుల నీటిని విడుదల చేశారు. మరో రెండ్రోజులపాటు జలాలు రానున్నట్లు అధికారులు తెలిపారు.