రామగిరి, మే 3: విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందించడమే లక్ష్యంగా ముం దుకు సాగుతున్నామని ఎంజీయూ వీసీ చొల్లేటి గోపాల్రెడ్డి అన్నారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో 7 వ సెనెట్ కమిటీ సమావేశం బుధవారం మినీ సమావేశం మందిరంలో నిర్వహించారు. సమావేశంలో 15 అకడమిక్ అంశాలతో(విద్యా సంబంధ అంశాల)పాటు వర్సిటీ బడ్జెట్, ఖర్చులు, నూతన అభివృద్ధి పనులపై కమిటీ అధికారులు, సభ్యులతో సుదీర్ఘంగా చర్చించారు. సెనెట్లో సూచించిన ఎజెండాలోని అంశాలను చర్చించి రూ. 108 కోట్లతోబడ్జెట్ను ఆమోదించారు. సెనెట్ కమిటీ చైర్మన్, వీసీ గో పాల్రెడ్డి, రిజిస్ట్రార్ కృష్ణారావుతో కలిసి చర్చి ంచి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంజీయూలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఉన్న హాస్టళ్లు కాకుండా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వర్సిటీ ప్రాంగణంలో బాల, బాలికలకు వేర్వేరు హాస్టళ్ల నిర్మిస్తున్నామన్నారు.
నల్లగొండ ఉమ్మడి జిల్లా విద్యార్థులతోపాటు ఇతరులకు అవకాశాలు కల్పించేలా వచ్చే విద్యా సంవత్సరం వర్సిటీలో ఎంఏ- సైకాలజీ, బీటెక్లో సీఎస్సీతోపాటు డిప్లొమో ఇన్ యోగా సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. ఐదేండ్ల ఫార్మా కోర్సుల్లో చేరిన విద్యార్థులు మూడేండ్లకే కోర్సు ముగిస్తే బీఎస్సీ కెమిస్ట్రీతో సర్టిఫికెట్ జారీ చేస్తామన్నారు. ఈనెల 24, 25, 26లో న్యాక్ బృందం వస్తుందని, న్యాక్ గ్రేడ్ ‘ఏ’ కోసం అన్ని శాఖలు కృషి చేయాలని సూచించారు. వర్సిటీ మాజీ వీసీ గంగాధర్రావు, మాజీ రిజిస్ట్రార్ నరేందర్రెడ్డి, ఎంజీయూ ఓఎస్డీ అల్వాల రవి, ఎంజీయూ పాలకమండలి సభ్యుడు బోయపల్లి కృష్ణారెడ్డి, సూర్యనారాయణరెడ్డి, డాక్టర్ కొప్పుల అంజిరెడ్డి, డాక్టర్ ఆకుల రవి, డాక్టర్ ఎన్.శ్రీదేవి, డాక్టర్ ఘన్శ్యాం, డాక్టర్ కోయి కోటేశ్వర్రావు, డీన్స్ కిషన్, జీబీరెడ్డి, సుధాకర్రెడ్డి, సరిత, సీఓఈ డాక్టర్మిర్యాల రమేశ్కుమార్, స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఉపేందర్రెడ్డి, ప్లేస్మెంట్ అధికారి డాక్టర్ ప్రశాంతి పాల్గొన్నారు.