కోదాడ, జూన్ 27 : మద్యం మత్తులో బైక్ వెళ్తూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం వద్ద శనివారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పట్టణ పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.
బీహార్కు చెందిన రాజేష్, శివాజీ అనే యువకులు రెండు సంవత్సరాలుగా కోదాడలోని ఓ రైసు మిల్లులో హమాలీలుగా పనిచేస్తున్నారు. శనివారం రాత్రి మద్యం సేవించిన వారు తెల్లవారుజామున బైక్పై వెళ్తూ జాతీయ రహదారి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. దీంతో రాజేష్, శివాజీ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ శివశంకర్ నాయక్ వెల్లడించారు.