మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో కారు దూసుకుపోతున్నది. బుధవారం నియోజకవర్గవ్యాప్తంగా టీఆర్ఎస్ నేతలు తమకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించిన గ్రామాల్లో కలియదిరిగి కలిసి ఓట్లు అభ్యర్థించారు. జనంతో మమేకమవుతూ.. కష్టసుఖాల్లో ఇంటి పార్టీగా టీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసాను అందిస్తున్నారు. కారు గుర్తుకు ఓటేసి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు.
అన్నా.. ఆశీర్వదించే…
నాంపల్లి మండలం గానుగుపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మోసపూరిత వాగ్దానాలతో ప్రజలకు ఒరిగేది ఏమీలేదన్నారు. నేను మునుగోడు బిడ్డనని, ఆశీర్వదించి గెలిపిస్తే నిత్యం అందుబాటులో ఉంటానని హామీనిచ్చారు.
–నాంపల్లి, అక్టోబర్ 19
అవ్వతో ఆప్యాయంగా..
చౌటుప్పల్ మండలం ఆరెగూడెం, గుండ్లబావి, కాట్రేవు గ్రామాల్లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి రాష్ట్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. రెండు వేల రూపాయల పింఛన్ ఇస్తున్న సీఎం కేసీఆర్కు మద్దుతుగా కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
– చౌటుప్పల్ రూరల్, అక్టోబర్ 19
అన్నదాతా.. దండమే!
మర్రిగూడ మండలం దామెరభీమనపల్లిలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులతో ముచ్చటిస్తూ ఈ ప్రాంత ప్రజల పోరాటం, స్ఫూర్తి గొప్పదని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో అబద్ధాలతో ప్రజలను ఏమార్చి గెలువాలని చూస్తున్న బీజేపీని తరిమికొట్టాలని కోరారు. రైతాంగానికి ప్రభుత్వం చేస్తున్న మేలును చూసి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.
–మర్రిగూడ, అక్టోబర్ 19
అభయమివ్వు తల్లీ…
ప్రజలు ఓట్లేసి గెలిపించింది అమ్ముడుపోవడానికి కాదని, రాజగోపాల్రెడ్డి 18 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసం అమ్ముడుపోయాడని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. ప్రచారంలో భాగంగా ఆయన సంస్థాన్నారాయణపురం ఎంపీటీసీ-1 ఇన్చార్జిగా ఉన్న మంత్రి స్థానిక ముదిరాజ్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ వృద్ధురాలికి రెండు చేతులుజోడించి
ఓటు అభ్యర్థించారు.
– సంస్థాన్ నారాయణపురం, అక్టోబర్ 19
సబితమ్మ సహపంక్తి భోజనం
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్లను భారీ మెజార్టీతో గెలిపించాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. నాంపల్లి మండలంలోని పసునూరులో మహిళా సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా వారితోకలిసి సహపంక్తి భోజనం చేశారు.
– నాంపల్లి, అక్టోబర్19
గంటె పట్టి అభిమానం ‘దోసె’..
మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా చండూరు పట్టణంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బుధవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ హోటల్కు వెళ్లి కస్టమర్లకు దోసె వేసిచ్చి ఓట్లు అడిగారు.
– చండూరు, అక్టోబర్19
గౌడన్నా.. కారు గుర్తుంచుకో..
చౌటుప్పల్ మున్సిపాలిటీ నాలుగో వార్డులో వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ బుధవారం ఇంటింటికీ వెళ్లి టీఆర్ఎస్ పథకాలను వివరించారు. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న గీత కార్మికు
డిని ఆప్యాయంగా పలుకరించారు. కారు గుర్తుకు ఓటేసి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని దీవించాలని కోరారు.
– చౌటుప్పల్, అక్టోబర్ 19