కట్టంగూర్, జనవరి 4 : ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆటో యూనియన్ కార్మికులు గురువారం మండల కేంద్రంలో ధర్నా చేపట్టి భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా యూనియన్ మండలాధ్యక్షుడు మేడి శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించి తమ పొట్ట కొట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్యాసింజర్లు ఆటోలు ఎక్కకుండా బస్సుల్లో వెళ్తుండడంతో తమ కుటుంబాలు గడవడం కష్టంగా మారిందని పేర్కొన్నారు. ప్రభుత్వం తమకు జీవన భృతి కల్పించాలని కోరారు. కార్యక్రమంలో నగేశ్, దాసరి ప్రవీణ్, లతీఫ్, కొప్పు రాములు, తండు నాగయ్య చంద్రయ్య, గోపాల్, సైదులు, బద్దం శ్రీను, రవి, వెంకన్న, అంజి, నాగరాజు, యాదగిరి, రామలింగం, వెంకటేశం పాల్గొన్నారు.