నల్లగొండ : జిల్లాలోని నార్కట్పల్లి శివారులో జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని రాజోలు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఎస్ కే ఎస్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.
అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా, ప్రయాణికులను వేరొక బస్సు ఎక్కించి హైదరాబాదుకు పంపించారు. వర్షం కురుస్తుండటంతో రోడ్డు కనిపించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది.