మిర్యాలగూడ రూరల్, జనవరి 3 : మండలంలోని అవంతీపురం గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎస్టీ గురుకుల పాఠశాలల సైన్స్ ఫెయిర్ బుధవారం ముగిసింది. విద్యార్థులు ఆవిష్కరించిన పలు ప్రయోగాలను ప్రదర్శించారు.
ముగింపు సమావేశంలో పలు పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎస్టీ గురుకుల పాఠశాలల రీజినల్ కో ఆర్డినేటర్ కె.లక్ష్మయ్య, వివిధ పాఠశాలల ప్రిన్సిపాల్స్, విద్యార్థులు పాల్గొన్నారు.