బీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నుంచి వలసలు కొనసాగుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలు స్వచ్ఛందంగా చేరుతున్నారు. సోమవారం హాలియాలో నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ సమక్షంలో మాడ్గులపల్లి మండలం నారాయణపురం, మాచినపల్లి గ్రామాలకు చెందిన నలుగురు వార్డు సభ్యులతోపాటు 150 మంది కార్యకర్తలు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారు. గరిడేపల్లి మండలం పొనుగోడులో కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యురాలితోపాటు కాంగ్రెస్, బీజేపీ నుంచి 60 మంది హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ పంచాయతీ పరిధి ఎర్రగుంట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యుడితోపాటు పలువురు బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సమక్షంలో, రామన్నపేట మండలం జనంపల్లి, ఉత్తటూరు గ్రామాలకు చెందిన 100 మంది వివిధ పార్టీల నుంచి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
– హాలియా, జూలై 10
హాలియా, జూలై 10 : రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. మాడ్గులపల్లి మండలం నారాయణపురం, మాచినపల్లి గ్రామాలకు చెందిన నలుగురు వార్డు సభ్యులతో పాటు 150 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోమవారం హాలియాలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళితబందు, కేసీఆర్ కిట్ వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధికి రెండేండ్ల కాలంలో రూ.1000 కోట్లు అందించినట్లు చెప్పారు. ప్రతి గ్రామ పంచాయతీలో రూ.30 నుంచి రూ. 50 లక్షల మేర అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. పార్టీ కార్యకర్తలు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో కొండేటి శ్రీనివాస్, గన్నెపాక మహేశ్, అల్లంపల్లి సైదులు, మామిడి జానయ్య, కార్యకర్తలు అల్లంపల్లి శేఖర్, వెంకన్న, దారమల్ల వెంకన్న, యడవల్లి లక్ష్మణ్, మర్రి పెద లింగయ్య, ఆవుల కోటి, తవిటి నాగరాజు, రమేశ్, భాస్కర్, మహేందర్, కోటేశ్, తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్చైర్మన్ ఇరిగి పెద్దులు, మార్కెట్ చైర్మన్ జవ్వాజి వెంకటేశ్వర్లు, మాడ్గులపల్లి మండలాధ్యక్షుడు పగిళ్ల సైదులు, మార్కెట్ కమిటీ మాజీ వైస్చైర్మన్ పిచ్చిరెడ్డి, సర్పంచులు యాదగిరిరెడ్డి, కాటేపల్లి వెంకన్నగౌడ్, ఆవుల అనితావెంకన్న, నాయకులు పాల్గొన్నారు.
సబ్బండ వర్గాల చూపు బీఆర్ఎస్ వైపు
రామన్నపేట, జూలై 10 : ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధిని చూసే సబ్బండ వర్గాల ప్రజలు బీఆర్ఎస్లో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని జనంపల్లి, ఉత్తటూరు గ్రామాలకు చెందిన 100 మంది సోమవారం నార్కట్పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్యకర్తలు ప్రజలతో మమేకమై ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి గురించి గడపగడపకూ వెళ్లి వివరించాలన్నారు. పాత, కొత్త తేడా లేకుండా కార్యకర్తలంతా పార్టీ పటిష్టతకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి పోశబోయిన మల్లేశం, సర్పంచ్ రేఖ యాదయ్య, ఎంపీటీసీ వేమవరపు సుధీర్బాబు, గ్రామశాఖ అధ్యక్షుడు బండ దామోదర్రెడ్డి, జెట్టి సైదులు, నాయకులు కోళ్ల కిషన్, నడిగోటి కృష్ణ, కోళ్ల రామకృష్ణ, నక్క నరేందర్ పాల్గొనగా, పార్టీలో చేరిన వారిలో బీరం రాజురెడ్డి, బైరు హరికృష్ణ, రాంరెడ్డి, చొప్పరి ఉపేందర్, రెమిడాల వెంకటేశ్, ఎల్లయ్య, బొంత రాజు, చొప్పరి బాబు, రాచమల్ల లింగం, వంగాల మారయ్య, నరేశ్, మేడి పరశురాం, మారయ్య, లక్ష్మణ్, వెంకన్న, పొనుగోటి శ్రీనివాస్రావు, జంగిలి శ్రీను, మేడి నర్సింహ, కోళ్ల రమేశ్, స్వామి పాల్గొన్నారు.