అరవయ్యేండ్ల కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి నల్లగొండకు చేసిందేమీ లేదని, అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికి వదిలేసి స్వలాభం కోస పనిచేశారని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి మండిపడ్డారు. శాలిగౌరారం మండలం అడ్లూర్లో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్తో కలిసి శుక్రవారం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. సాగునీటిని, 24 గంటల కరెంట్ ఇచ్చి కరువును
పారదోలిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు.
కాళేశ్వరం జలాలతో సూర్యాపేట జిల్లా సస్యశ్యామలమైందని తెలిపారు. సీట్ల కోసం కొట్లాటలు, రోజుకో మాట మాట్లాడే కాంగ్రెస్ నాయకులను జనం నమ్మే పరిస్థితి లేదని, గ్రామాల్లోకి రానివ్వడం లేదని చెప్పారు. ప్రజల ఆదరాభిమానాలతో ఉమ్మడి నల్లగొండలో 12కు 12 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. డబ్బుతో ఓట్లను కొనుక్కుంటామనే అహంకారంతో ఉన్న కాంగ్రెస్ నేతలకు జనం ఓటుతో బుద్ధి చెప్తారని తెలిపారు.
శాలిగౌరారం, నవంబర్ 10: కాంగ్రెస్ 60 ఏండ్లలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చేసిన అభివృద్ధి శూన్యం అని, ఏనాడు అభివృద్ధ్ది గురించి మాట్లాడని ప్రతిపక్ష పార్టీల నాయకుల కల్లబొల్లి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండలంలోని అడ్లూర్ గ్రామంలో శుక్రవారం రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. నల్లగొండ జిల్లాలో కరువును పారదోలి నీళ్లను తెప్పించిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో కనీసం తాగునీరు సైతం లేని దుస్థితి నుంచినేడు గోదావరి జలాలతో రైతులు ధాన్యపు సిరులు పండిస్తున్నారని అన్నారు.
తుంగతుర్తిని సస్యశ్యామలం చేసిన ఘనత ఎమ్మెల్యే కిశోర్కుమార్దే పగలు, కక్షలతో కునారిల్లిన తుంగతుర్తి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత ఎమ్మెల్యే కిశోర్కుమార్కే దక్కిందన్నారు. రాష్ట్రంలో ప్రజలు బీఆర్ఎస్నే ఆదరిస్తున్నారని, ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి అన్ని అసెంబీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకోబోతుందన్నారు. డబ్బులతో ఓట్లను కొనుక్కుంటామని అహంకారంతో కాంగ్రెస్ నేతలు ఉన్నారని, అహంకారులకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.సీట్ల కోసం కొట్లాటలు, రోజుకో మాట మాట్లాడే కాంగ్రెస్ నాయకులను జనం నమ్మే పరిస్థితి లేదని, గ్రామాల్లోకి రానివ్వడం లేదని చెప్పారు.
స్వలాభం కోసం తుంగతుర్తి గ్రామాల్లో రక్తం పారిచిన చరిత్ర గత పాలకులదే అన్నారు. బీఎన్ రెడ్డి కలలను నిజం చేసిన ఘనత బీఆర్ఎస్కు దక్కుతుందన్నారు. గత రెండు మ్యానిఫెస్టోలను నూటికి నూరు శాతం అమలు చేసిన కేసీఆర్ మూడోసారి చెప్పిన విధంగా పథకాలను అమలు చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉందని అన్నారు. ఆకలితో ఉన్న కాంగ్రెస్ నాయకులు పాచీకలు చైతన్యవంతమైన ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల ముందు సాగవు అని అన్నారు. ప్రజలకు ఏం చేస్తామో చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితిలో కాంగ్రెస్ నేతలు ఉన్నారని ఎద్దేవా చేశారు. సమావేశంలో ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, రేగట్టె మల్లి కార్జున్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అయితగోని వెంకన్నగౌడ్, బీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు కట్టా వెంకట్రెడ్డి పాల్గొన్నారు.