నల్లగొండ : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వామపక్ష కార్మిక, ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు.
నల్లగొండలోని సుభాష్ విగ్రహం వద్ద ప్రజాసంఘాల నేతలు నల్లజెండాలతో ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వివిధ మండల కేంద్రాల్లోనూ నిరసనలు కొనసాగుతున్నాయి.