దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్
కొండమల్లేపల్లి, ఆగస్టు 25 : అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మండలానికి చెందిన 922 మంది లబ్ధిదారులకు కొత్తగా మంజూరైన పింఛన్ ధ్రువపత్రాలను గురువారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 57 సంవత్సరాలు నిండిన పేదలందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్లు అందిస్తుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ దూదిపాల రేఖాశ్రీధర్రెడ్డి, జడ్పీటీసీ సరస్వతమ్మ, ఎంపీడీఓ బాలరాజురెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమావత్ దస్రూనాయక్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు కేసాని లింగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శిరందాసు లక్ష్మమ్మాకృష్ణయ్య, వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటయ్య, సర్పంచ్ కుంభం శ్రీనివాస్గౌడ్, నాయకులు గంధం సురేశ్, మేకల శ్రీనివాస్యాదవ్, అబ్బనబోయిన శ్రీనివాస్యాదవ్, పంచాయతీ కార్యదర్శి వీరబాబు పాల్గొన్నారు.
పీఏపల్లిలో 1662 మందికి పంపిణీ
పెద్దఅడిశర్లపల్లి : మండల కేంద్రంలోని కమ్యూనిటీ హాల్లో 1662 మందికి కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే రవీంద్రకుమార్ పంపిణీ చేశారు. ఆసరా పింఛన్లతో పేదలకు ప్రభుత్వం అండగా ఉంటున్నదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వంగాల ప్రతాప్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వల్లపురెడ్డి, ఎంపీడీఓ మోహన్రెడ్డి, వైస్ ఎంపీపీ అర్వపల్లి సరిత, స్థానిక సర్పంచ్ గొర్ల సైదమ్మ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
కట్టంగూర్, ఆగస్టు 25 : రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలో కొత్తగా మంజూరైన 1,476 పింఛన్ కార్డులను గురువారం కట్టంగూర్లోని ఎంఎస్ఆర్ ఫంక్షన్హాల్లో లబ్ధిదారులకు పంపిణీ చేసి మాట్లాడారు. పింఛన్ల మంజూరు నిరంతర పక్రియ అని, ఇంకా ఉన్న అర్హులకు కూడా త్వరలో సీఎం కేసీఆర్ కొత్త పింఛన్లు మంజూరు చేస్తారని చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడి వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులకు కొత్త పింఛన్లు మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తరాల బలరాములు, ఎంపీడీఓ పోరెళ్ల సునీత, తాసీల్దార్ దేశ్యానాయక్, వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు గుర్రం సైదులు, నకిరేకల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నర్సింహ, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు పాలడుగు హరికృష్ణ, ఎంపీఓ అహ్మద్ అథర్ పర్వేజ్, సూపరింటెండెంట్ చింతమల్ల చలపతి, ఏపీఓ కడెం రాంమోన్, ఏపీఎం చౌగోని వినోద, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండలు, పీఏసీఎస్ చైర్మన్ నూక సైదులు, సర్పంచ్ ఎంపీటీసీలు పాల్గొన్నారు.
కేతేపల్లిలో 1269 మందికి అందజేత
కేతేపల్లి : మండల కేంద్రంలోని జ్యోతి ఫంక్షన్హాల్లో 1,269 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే పింఛన్ మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఎంపీపీ పి.శేఖర్, జడ్పీటీసీ బి.స్వర్ణలత, తాసీల్దార్ డి.వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ వెంకటేశ్వర్రావు, ఎంఈఓ ఎం.నాగయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు బి.శ్రీనివాస్యాదవ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మారం వెంకట్రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్
కోదాడ, ఆగస్టు 25 : రాష్ట్రంలోని పేదలను అన్ని విధాల ఆదుకుంటున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని పలు వార్డుల్లో కొత్తగా పింఛన్ మంజూరైన 1790 మంది లబ్ధిదారులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ కిరణ్కుమార్, ఆర్డీఓ కిశోర్కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్రా సుధారాణీపుల్లారెడ్డి, కమిషనర్ మహేశ్వర్రెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు చందు నాగేశ్వర్రావు, మున్సిపల్ కౌన్సిలర్ సామినేని ప్రమీలాఅపర్ణ, వెంకట్, నరేష్, కందుల చంద్రశేఖర్, కోటేశ్వరరావు, కల్లూరి పద్మజ, షఫి, రమాదేవి, ఖదీర్, గుండెల సూర్యనారాయణ, మైస రమేశ్, మధుసూదన్, ఒంటిపులి రమాశ్రీనివాస్, కట్టెబోయిన జ్యోతీశ్రీనివాస్, గ్రంథాలయ చైర్మన్ రహీం పాల్గొన్నారు.
ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
చింతలపాలెం, ఆగష్టు 24 : ఆసరాతో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఆర్థికంగా భరోసా ఇస్తుందని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నా రు. మండలంలో కొత్తగా మంజూరైన పింఛన్ల గుర్తిం పు కార్డులను గురువారం మండల కేంద్రంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. 57 సంవత్సరాలకే పింఛన్ అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కొత్తమద్ది వెంకటరెడ్డి, ఎంపీడీఓ గ్యామా నాయక్, తాసీల్దార్ సచిన్ చందర్ తివారీ, వైస్ ఎంపీపీ శ్రీనివాస్రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ రంగాచారి, దొండపాడు చైర్మన్ కోటిరెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.
మేళ్లచెర్వులో 1291 మందికి..
మేళ్లచెర్వు : మండలానికి చెందిన 1291 మందికి కొత్తగా మంజూరైన పింఛన్ల గుర్తింపు కార్డులను గురువారం మండల కేంద్రంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కొట్టె పద్మాసైదేశ్వర్రావు, జడ్పీటీసీ పద్మాగోవిందరెడ్డి, ఎంపీడీఓ ఇసాక్ హుస్సేన్, సర్పంచ్ శంకర్రెడ్డి, హుజూర్నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు
మిర్యాలగూడ,ఆగస్టు 25 : రాష్ట్రంలోని పేదలను అన్ని విధాలుగా ఆదుకుంటూ సీఎం కేసీఆర్ వారి పాలిట దేవుడిగా నిలిచారని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. గురువారం మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో 2,596 మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్ల మంజూరు పత్రాలను మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్తో కలిసి ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తం గా 46లక్షల మందికి ఆసరా పింఛన్లు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటి వరకు రూ. 1200 కోట్లకు పైగా నిధులు వెచ్చించినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతో రూ.700 కోట్లతో 3 ఎత్తిపోతల పథకాలు మంజూరయ్యాయని, ఇప్పటికే పనులు కూడా ప్రారంభమయ్యాయని చెప్పారు. ఏరియా ఆస్పత్రిని కూడా సకల హంగులతో ఆధునీకరించామని, ప్రైవేటు ఆస్పత్రుల కంటే మెరుగైన సేవలు అందుతున్నాయని తెలిపారు. అంతకు ముందు ఆసరా పించన్లు అందించిన సీఎం కేసీఆర్ చిత్రపటానికి లబ్ధిదారులు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమినర్ రవీందర్సాగర్, వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.