నీలగిరి, ఏప్రిల్ 15: జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ర్టాలకు అన్యాయం జరుగుతుందని, దీంతో ఉన్న సీట్లకు 50 శాతం పెంచేలా కేంద్రం కొత్త విధానం ప్రతిపాదించిందని, 50 శాతం జనాభా, 50 శాతం జీఎస్టీ పరంగా చేయాలని పలు రాష్ట్రాలు ప్రతిపాదిస్తున్నాయని, ఇది సాధ్యం కాదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అభిప్రాయపాడ్డారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమిలీ ఎన్నికలు నిర్వహించడమే మంచిదని, తొలి విడతగా దేశంలో 18 రాష్ట్రాల్లో జమిలీ ఎన్నికలు జరుగుతాయన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఒకేసారి జరిగాయని, ఆ పద్ధతిలో ఎన్నికలు జరిగితే సమస్యలు ఉండవని, కానీ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు వేర్వేరుగా నిర్వహించడం వల్ల పరిస్థితులు మారుతున్నాయన్నారు. ముఖ్యంగా ఓటర్లు అభివృద్ధి చూసి ఓట్లు వేయడం లేదని, పైసలు పైసలే.. ఓట్లు ఓట్లే అన్నట్టు చూస్తున్నారని, ప్రజల్లో కూడా మార్పు రావాల్సిన ఆవశ్యకత ఉన్నదన్నారు.
జిల్లాలో రైసు మిల్లర్లతో చర్చలు జరిపామని కొనుగోళ్ల సమస్య పరిష్కారమైందన్నారు. తాలు ఎకువగా వస్తుండటంతో కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయని చెప్పారు. మిల్లర్లు ఎదురొంటున్న ప్రధాన డిమాండ్లు నెరవేరిస్తే ధాన్యం కొనేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
ఏఎమ్మార్పీ 4000 క్యూసెకుల నీరు సాగాలని, ఆ దిశగా కాల్వల నిర్మాణం జరిగిందన్నారు. కానీ ప్రస్తుతం 2400 క్యూసెకులకు మించి నీరు ప్రవహించే పరిస్థితి లేదని వాటిని విస్తరించడం వల్ల రైతులకు మేలు జరుగుతుందన్నారు.