నూతనకల్, జూలై 26 : అర్హులైన ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు అందిస్తున్నదని ఎంపీపీ భూరెడ్డి కళావతీసంజీవరెడ్డి, జడ్పీటీసీ కందాల దామోదర్రెడ్డి అన్నారు. మండలంలో 294 మందికి మంజూరైన కొత్త రేషన్ కార్డులను మండల కేంద్రంలోని ఐఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి పేదవాడి కడుపు నింపేందుకే సీఎం కేసీఆర్ కొత్త ఆహార భద్రత కార్డులు మంజూరు చేశారన్నారు. లబ్ధిదారులకు వచ్చే నెల నుంచే రేషన్ సరుకులు అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కనకటి వెంకన్న, వైస్ ఎంపీపీ జక్కి పరమేశ్, తాసీల్దార్ జమీరుద్దీన్, సర్పంచ్ తీగల కరుణశ్రీ, ఎంపీటీసీ ఏర్పుల నరేశ్, ఆర్ఐలు సుజిత్, షరీఫ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మున్న మల్లయ్య, లబ్ధిదారులు పాల్గొన్నారు.
మద్దిరాలలో కార్డుల పంపిణీ
మద్దిరాల : మండలానికి మంజూరైన కొత్త రేషన్ కార్డులను సోమవారం రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ఏ. రజాక్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మండలంలో 334 మందికి రేషన్ కార్డులు వచ్చినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ గుడ్ల ఉపేంద్ర, జడ్పీటీసీ కన్న సురాంబ, వైస్ ఎంపీపీ బెజ్జెంకి శ్రీరాంరెడ్డి, తాసీల్దార్ మన్నన్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కుందూరు విష్ణువర్ధన్రెడ్డి, సర్పంచ్ షేక్ ఇంతియాజ్ రజాక్ పాల్గొన్నారు.