మిర్యాలగూడ, జనవరి 10 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిరుపేదలకు కొండంత ఆసరాగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. నియోజకవర్గానికి చెందిన 60 మందికి మంజూరైన రూ.29.9లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను మంగళవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో అందించి మాట్లాడారు. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా సీఎం కేసీఆర్ ఉదారంగా వ్యవహరిస్తూ అనారోగ్యంతో ఆర్థికంగా నష్టపోయిన బాధితులకు సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, డీసీఎంఎస్ వైస్చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, మున్సిపల్ వైస్చైర్మన్ కుర్ర విష్ణు, నాయకులు కె.వీరకోటిరెడ్డి, నామిరెడ్డి కరుణాకర్రెడ్డి, ఇరుగు వెంకటయ్య, చిర్ర మల్లయ్యయాదవ్, హతీరాం, ఎండీ. యూసుఫ్, ధీరావత్ రవితేజ, జె.రాములుగౌడ్, ఏడుకొండలు పాల్గొన్నారు.