ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి
గుండాలలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
గుండాల, జూన్ 27 : సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలోని మహిళలకు సముచిత గౌరవం దక్కుతుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. సోమవారం గుండాల మండల పరిషత్ కార్యాలయంలో 35 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ పేదింటి ఆడబిడ్డల కోసం కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించారని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతోపాటు ఉచిత పుస్తకాలు, దుస్తులు అందజేస్తున్నట్లు తెలిపారు. మన ఊరు-మన బడి కింద అద్భుతమైన సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.
ప్రభుత్వ దవాఖానల్లో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి అడవుల శాతాన్ని పెంచాలని, పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. సమావేశం అనంతరం సుద్దాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని విద్యార్థులతో మాట్లాడారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. తదనంతరం అనంతారం గ్రామానికి వచ్చే అశ్వరావుపల్లి కెనాల్ ప్రాజెక్టుకు సంబంధించిన మ్యాప్ను ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. కాల్వ ద్వారా గ్రామానికి ఏ విధంగా సాగునీరు అందుతుందనే విషయాలపై రైతులతో మాట్లాడారు. కార్యక్రమాల్లో ఎంపీపీ తాండ్ర అమరావతీశోభన్బాబు, జడ్పీటీసీ కోలుకొండ లక్ష్మీరాములు, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ ఖలీల్, వైస్ ఎంపీపీ మహేందర్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మూగల శ్రీనివాస్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ గడ్డమీది పాండరి, తాసీల్దార్ శ్రీనివాస్రాజు, ఎంపీడీఓ శ్రీనివాసులు, మాజీ ఎంపీపీలు సంగి వేణుగోపాల్, హరితాదేవి, మాజీ జడ్పీటీసీ మందడి రామకృష్ణారెడ్డి, సర్పంచులు సైదులు, ఉపేంద్ర, బాషిరెడ్డి, వరలక్ష్మి, భిక్షమయ్య, మాధవి, ఎంపీటీసీలు బొంగు శ్రీశైలం, సుశీల, నరేశ్, పాయిలి కవిత, టీఆర్ఎస్ నాయకులు బండ రమేశ్రెడ్డి, ఇమ్మడి దశరథ, చెన్నారెడ్డి, పూర్ణచందర్, అంజిరెడ్డి, మమత, మహోదయ్, రమేశ్, శేఖర్, రంజిత్రెడ్డి, నాగరాజు, సాయి, నగేశ్, దయాకర్, చిన్నపరెడ్డి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.