ఆలేరుటౌన్, ఫిబ్రవరి 6 : రేవంత్రెడ్డికి బుద్ధి చెప్పాలంటే కారు గుర్తుకు ఓటెయ్యాలని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ పేర్కొన్నారు. ఆలేరులో శుక్రవారం 1 నుంచి 12 వార్డుల్లో ఇంటింటి ప్రచారం చేశారు. దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డిను గద్దెదించాలన్నారు.
ఆలేరు, యాదగిరిగుట్టలో మైనార్టీలను ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని డీసీసీబీ మాజీ చైర్మన్, రైతు విభాగం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్రెడ్డి, ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి అన్నారు. ఆలేరులోని కమలమ్మ జనార్ధన్ ఫంక్షన్ హాల్లో వారు మాట్లాడారు. బీఆర్ఎస్ యాదగిరిగుట్టలో ఒక సీటు మైనార్టీలకు కేటాయించినట్లు చెప్పా రు. కారుగుర్తుపై ఓటేసి గెలింపించాలని కోరా రు.ఎన్నికల ఇన్చార్జీలు పసుల ప్రభాకర్రెడ్డి, సంజీవరెడ్డి, లక్ష్మీనారాయణ, బాబు, సతీశ్రెడ్డి, ఎండీ బద్రుద్దీన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి, మాజీ జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్, పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేశం గౌడ్, మున్సిపాల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ గ్యాధపాక నాగరాజు, మాజీ ఎంపీపీ క్యాసగళ్ల అనసూ య, పీఏసీఎస్ చైర్మన్ మొగులుగాని మల్లేశం, బీఆర్ఎస్ నాయకులు కందుల శంకర్, బీఆర్ఎస్ నాయకులు కొలుపుల హరినాథ్, ఆడే పు బాలస్వామి, కర్రె అశోక్, బేతి రాములు, బొందుగుల మాజీ సర్పంచ్ రామ్గోపాల్రెడ్డి, గిరిరాజు వెంకటయ్య, సిరిగిరి విద్యాసాగర్, యాట విజయలక్ష్మి, జ్యోతి, భావాని, బండ్రు ఆంజనేయులు పాల్గొన్నారు.