రామగిరి, నవంబర్ 23 : నల్లగొండలోని ఎంజీయూ వర్సిటీ స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్ కాలేజ్యట్ టోర్నమెంట్(ఐసీటీ) కబడ్డీ పురుషులు, మహిళల పోటీలు బుధవారం ముగిశాయి. పోటీల్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా క్రీడాకారులు హాజరై సత్తా చాటారు. మహిళల విభాగంలో విజేతగా నల్లగొండ ఎన్జీ కళాశాల జట్టు నిలవగా, టీఎస్డబ్ల్యూఆర్ఏఎఫ్పీడీసీ భువనగిరి జట్టు రన్నరప్గా నిలిచింది. పురుషుల విభాగంలో సైతం నల్లగొండ ఎన్జీ కళాశాల జట్టు విజేతగా నిలవగా, కట్టంగూర్ అయిటిపాములకు చెందిన జోనా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ రన్నరప్గా నిలిచింది. యూనివర్సిటీ జట్టుకు ఎంపికైన విద్యార్థులు త్వరలో జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీలకు హాజరుకానున్నారు. విజేతలకు ఎంజీయూ రిజిస్ట్రార్, ప్రొఫెసర్ కృష్ణారావు, స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి జి.ఉపేందర్రెడ్డి, టూటౌన్ సీఐ గోపి బహుమతులు అందించి అభినందించారు. కార్యక్రమంలో ఎంజీయూ పీడీలు వై.శ్రీనివాస్రెడ్డి, ఆర్.మురళి, ఉమెన్స్ ఇన్చార్జి పీడీ సుంకరి రాజారాం పాల్గొన్నారు.
ఎంజీయూ మహిళా కబడ్డీ జట్టు ఇదే..
పి.కృష్ణవేణి, కేఆర్ఆర్ డిగ్రీ కళాశాల కోదాడ ఎస్.ధరణి, టీఎస్డబ్ల్యూఆర్ఏఎఫ్పీడీసీడబ్ల్యూ భువనగిరి
కె.సంగీత, టీఎస్డబ్ల్యూఆర్ఏఎఫ్పీడీసీడబ్ల్యూ భువనగిరి ఆర్.అనూష, ఎన్జీ కళాశాల నల్లగొండ
ఆర్.త్రివేణి, ఎన్జీ కళాశాల నల్లగొండపి.సుజాత, ఎన్జీ కళాశాల నల్లగొండకె.అంజలి, ఎన్జీ కళాశాల నల్లగొండ వి.సంధ్య, భువనగిరి టీఎస్డబ్ల్యూఆర్ఏఎఫ్పీడీసీడబ్ల్యూ ఎం.స్వాతి, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నల్లగొండ జి.మేఘన, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నల్లగొండ బి.శిరీష, టీఎస్డబ్ల్యూఆర్ఏఎఫ్పీడీసీడబ్ల్యూ భువనగిరి