రామన్నపేట, డిసెంబర్6: జిల్లాలో నేరాల నియంత్రణకు పటిష్టచర్యలు తీసుకుంటున్నట్లు డీసీపీ కె.నారాయణరెడ్డి తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం రామన్నపేట పోలీస్స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. ఈ సంద ర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. రికార్డులను పరిశీలించి నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు.
ఆయుధాలను పరిశీలించారు. అనంతరం పోలీస్స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఏసీపీ ఉదయ్రెడ్డి, సీఐ చింతా మోతీరాం, ఎస్ఐ లక్ష్మయ్య ఉన్నారు.