డీఏఓ సుచరిత
తిప్పర్తి, చండూరులో ఎరువులు, విత్తనాల డీలర్లతో సమావేశం
తిప్పర్తి, మే 13 : ఎరువుల దుకాణం డీలర్లు రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి సుచరిత హెచ్చరించారు. మండలంలోని దుప్పలపల్లి గ్రామంలోని రైతు వేదికలో శుక్రవారం నిర్వహించిన నియోజకవర్గస్థాయి డీలర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. వానకాలం సీజన్ ప్రారంభం అవుతుండడంతో ఎరువుల దుకాణం డీలర్లు రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సరఫరా విక్రయించాని సూచించారు. నకిలీ విత్తనాలను విక్రయిస్తే కేసులు నమోదు చేయడంతో పాటు డీలర్ల లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. అవసరమున్న మందులు మా్ర మే ఇవ్వాలని అదనంగా మందులు అంటకట్టరాదన్నారు. దుకాణాలలో స్టాకు వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. సమావేశంలో ఏడీఏలు శ్రవణ్, హుస్సేన్ బాబు, ఏఓ, ఏఈఓలు, డీలర్లు పాల్గొన్నారు.
నిబంధనలకు లోబడి విత్తనాలు విక్రయించాలి
చండూరు : వ్యాపారులు నిబంధనలకు లోబడి వి త్తనాలు విక్రయించాలని డీఏఓ సుచరిత సూచిం చారు. బంగారిగడ్డ రైతు వేదికలో చేసిన డీలర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. రైతులు లైసెన్స్ ఉన్న దుకాణాల్లో మాత్రమే విత్తనాలు కొనుగోలు చేసి రశీదులు పొందాలన్నారు. ఖాళీ కవర్లను పంట కా లం పూర్తయ్యేవరకు భద్రపరచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మునుగోడు ఏడీఏ ఎల్లయ్య, సీఐ అశోక్ రెడ్డి, ఏఓ మల్లేశ్, సర్పంచ్ పల్లె వెంకటయ్య ఎస్ఐ నవీన్ కుమార్, సతీశ్ రెడ్డి పాల్గొన్నారు.
దుకాణాల తనిఖీ
దామరచర్ల : మండల కేంద్రంలోని ఎరువులు, ఫర్టిలైజర్, విత్తన దుకాణాలను ఏఓ పార్వతి చౌహన్, ఎస్ఐ రవికుమార్ తనిఖీ చేశారు. ఎరువుల స్టాక్ను, రికార్డులను పరిశీలించారు. అనంతరం రైతువేదికలో పత్తి రైతులతో ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు.
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కేసులు
ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఉషారాణి
దేవరకొండ: నకిలీ విత్తనాలు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఉషారాణి హెచ్చరించారు. దేవరకొండ నియో జకవర్గంలో చింతపల్లి, కొండమల్లేపల్లి, దేవరకొండ, చింతపల్లి మండలాల్లో పలు విత్తన, ఎరువుల దుకాణాల్లో రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలను అమ్మి రశీదు ఇవ్వాలను డీలర్లకు సూచించారు. దుకాణాల్లో పత్తి విత్తనాల ప్యాకెట్లు సేకరించి ల్యాబ్లకు పంపించినట్లు ఆమె తెలిపారు. తనిఖీల్లో ఏడీఏ వీరప్ప, కిశోర్ కుమార్, సీఐ వెంకటేశ్వర్లు, ఏఓ రవి కుమార్, ఎస్ఐ బాలకిషన్ పాల్గొన్నారు.