‘ముఖ్యమంత్రి కేసీఆర్ సబ్బండ వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో తెలంగాణ ప్రాంతం చీకటిమయంగా మారింది. స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు రాకతో వెలుగులు నిండాయి.’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. పెన్పహాడ్లో గురువారం దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. తాము గెలిస్తే అది చేస్తాం.. ఇది చేస్తామని చెప్తున్నారని, 60ఏండ్లలో చేయనోళ్లు ఇప్పుడేం వెలగబెడుతారని ఎద్దేవా చేశారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతాన్ని పారాయి పాలనలో పెట్టి వారి మోచేతి నీళ్లు తాగిన వారికి తగిన బుద్ధి చెప్పి బీఆర్ఎస్కు మద్దతు తెలుపాలని పిలుపునిచ్చారు. అనంతరం దూపాడ్, లింగాల గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ వార్డు సభ్యులు, నాయకులు పెద్ద సంఖ్యలో మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
పెన్పహాడ్, నవంబర్ 2 : దేశంలో డబుల్ ఇంజిన్ పాలన చేస్తున్న బీజేపీ రాష్ర్టాల్లో కంటే ఎన్నో రెట్లుగా ఎక్కువగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ సబ్బండ జాతులకు సమన్యాయం చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని కొనియాడారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనానికి గురువారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దివ్యాంగులకు కేవలం రూ.600 ఇస్తుంటే తెలంగాణలో రూ.4వేలు ఇచ్చి వారి ఆత్మగౌరవాన్ని పెంచారన్నారు. బీఆర్ఎస్ తొమ్మిదేండ్ల పాలనలో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అర్హలందరికీ అందిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల సమయంలో మాయ మాటలు చెప్పి ఓట్ల కోసం వచ్చే వారిని నమ్మవద్దని సూచించారు. ఓటు అడిగే హక్కు ప్రతి పక్షాలకు లేదన్నారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ 60యేండ్లలో చేయని అభివృద్ధి ఇప్పుడు గెలిస్తే ఏం చేస్తాయని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాంతాన్ని పారాయి పాలనలో పెట్టి వారి మోచేతి నీరు తాగిన నేతలకు ప్రజలు తమ ఓటు ద్వారా బుద్ధి చెప్పాలన్నారు. బీఆర్ఎస్ హాట్రిక్ విజయం ఖాయమన్నారు.
ఈ సందర్బగా దూపాడ్, లింగాల గ్రామాల్లోని కాంగ్రెస్, బీజేపీకి చెందిన వార్డు మెంబర్లు, నాయకులు, ముఖ్య కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆ పార్టీలకు రాజీనామా చేసి మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అంతకుముందు మండలంలోని దోసపహాడ్లో గుండెపోటుతో మృతిచెందిన బీఆర్ఎస్ గ్రామ సీనియర్ నాయకుడు సద్దల యాదగిరి మృతదేహాన్ని మంత్రి సందర్శించి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఒంట్టెద్దు నర్సింహారెడ్డి, ఎంపీపీ నెమ్మాది భిక్షం, దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ నహీం, నాయకులు పేర్ల సోమయ్య, గార్లపాటి వెంకట్రెడ్డి, రామక్రిష్ణారెడ్డి, నర్సయ్య, పరంధాములు, రాధాకృష్ణ, శ్రీనివాస్, బిట్టు నాగేశ్వర్రావు, మామిడి వెంకన్న, పరెడ్డి సీతారాంరెడ్డి, బైరెడ్డి శ్రీనివాస్రెడ్డి, చెన్ను శ్రీనివాస్రెడ్డి, నెమ్మాది క్రిష్ణ, ఒగ్గు గోపి, రఫీ, మస్తాన్, దివ్యాంగులు పాల్గొన్నారు.